కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు : పువ్వాడ

-

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. రేవంత్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే.. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ రేవంత్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇవాళ పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రోడక్టేనని మండిపడ్డారు. రైతులను సంక్షోభంలోకి నెట్టివేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు పువ్వాడ అజయ్‌. వారి పాలనలో పగటిపూట విద్యుత్ ఉండేదే కాదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, అయినప్పటికీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు పువ్వాడ అజయ్‌.

Vaartha Online Edition %%page%% %%primary_category%% – కిలోమీటర్ బేసిస్ లో  కుదరని ఒప్పందం | Vaartha

రైతులకు మూడు గంటల విద్యుత్ అని రేవంత్ చెప్పారని, దీనిని మేనిఫెస్టోలో పెట్టగలరా? అని పువ్వాడ అజయ్‌ నిలదీశారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీని పాతాళంలోకి తీసుకు వెళ్ళాయన్నారు పువ్వాడ అజయ్‌. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని… ఆయన చూస్తూ చదివే రీడర్ అని పువ్వాడ అజయ్‌ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news