సీబీఐ మీ చేతిలోనే ఉందిగా.. సోము మీద వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు !

-

ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం ఘటనలో మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై వెల్లంపల్లి ఫైరయ్యారు. ఏపీలో విగ్రహాల ధ్వంసంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సాక్ష్యాలతో సహా బయట పెడితే బీజేపీ నేతలు ఆయన్ను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు మతవిద్వేషాలు రెచ్చగొట్టినా…చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.

గత ప్రభుత్వ హయాంలో కూలగొట్టిన ఆలయాలను…వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తోందని గుర్తు చేశారు. అధికారుల్ని ప్రభుత్వాన్ని బెదిరించాలని మీరు చూస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. దాడులు అంశాన్ని ఉపయోగించుకుని ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన మీద సిబిఐ విచారణ అప్పగించామని ఇప్పటివరకు ఎందుకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించ లేదని ప్రశ్నించారు. సీబీఐ కేంద్ర పరిధిలోనే ఉంది కదా అని ఆయన ప్రశ్నించారు. నాలుగు నెలలు పూర్తయినా ఇప్పటికీ దోషులను ఎందుకు పట్టుకోలేదని అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news