జగన్‌ను పవన్ కల్యాణ్ ఏం పీకలేరు : మాజీమంత్రి వెల్లంపల్లి

-

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విశాఖలో వారాహి యాత్రలో భాగంగా సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యా్ఖ్యలకు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పవన్ కల్యాణ్ ఏమీ పీకలేరని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పవన్ కల్యాణ్‌కు సత్తా ఉంటే సింగిల్‌గా రావాలి అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిపై పదే పదే మాట్లాడితే దేహ శుద్ధి చేస్తామని వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి పేదవాడి ఇంట్లో ఉన్న జగన్‌ని ఏక వచనంతో మాట్లాడితే రానున్న రోజులలో ప్రజలు పవన్‌కి తగిన రీతిలో బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

TDP trying to divert public attention: Andhra minister after Lord Rama idol  vandalised at Ramateertham temple - India Today

పవన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తాటతీస్తామని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్‌లో శుక్రవారం వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సేవ చేసేందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే 175 నియోజకవర్గాలలో సింగిల్‌గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. అభిమానులను చూపి ప్యాకేజీ కోసం అమ్ముడు పోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని ధ్వజమెత్తారు. ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కంటే కేఏపాల్ బెటర్ అని చెప్పుకొచ్చారు. కేఏ పాల్‌ని చూసైనా పవన్ కల్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news