విషాదం: క్యాన్సర్ కు చికిత్స పొందుతూ పోలీసు మృతి…

-

ఏపీ నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కానిస్టేబుల్ గా విధులను నిర్వహిస్తున్న పల్లెపాలెం కు చెందిన తాండ్ర రాము నిన్న మరణించారు. పేద కుటుంబం నుండి వచ్చి ఎంతోకష్టపడి పోలీసు ఉద్యోగాన్ని సాధించిన రాము ను అనారోగ్యం శాపంలా తగులుకుంది. గత కొంతకాలంగా రాము కాన్సర్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే కాన్సర్ కు చికిత్స అనేది డబ్బుతో కూడుకున్నది అని తెలిసిందే. అయినప్పటికీ తన శక్తిలేరకు ఖర్చు పెట్టుకోవడానికి సిద్దమైన తాండ్ర రాము చెన్నైలోని హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడానికి జాయిన్ అయ్యారు.

 

అయితే వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూనే కన్నుమూశారు. దీనితో నెల్లూరు రురల్ పల్లెపాలెం గ్రామం అంతటా విషాధచాయలు అలుముకున్నాయి. ఇతనే ఆధారంగా జీవిస్తున్న వీరి కుటుంబ పరిస్థితి ఏమిటని చుట్టుపక్కలవారు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news