మెదక్ లో వెంకట్రామి రెడ్డి గెలుపు చాలా ముఖ్యం : హరీశ్ రావు

-

మెదక్ లో వెంకట్రామి రెడ్డి గెలుపు చాలా ముఖ్యం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. తాజాగా సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో  మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు.  కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏపాటిదో ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ ఉన్నపుడు ఆరు గంటల కరెంటు ఇస్తే.. రూ. 90 వేల కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చారు. 
సాగునీటి కష్టాలు తొలగించింది కేసీఆర్. అప్పుడు నిండా ఉన్న జలాశయాలు, ఇప్పుడు ఎండిపోయి ఉన్నాయి. గడ్డిని కూడా నాడు ఆంధ్ర నుండి తెచ్చి పశువులను కాపాడుకున్నం. కేసీఆర్ కాలు పెడితే పదేళ్లు కరువు లేదు.. కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు తెచ్చింది.  ఒక్క హామిని కాంగ్రెస్ నెరవేర్చలేదు.. మీరు మాకు ఎంపీ సీట్లు ఇస్తే హామీల గురించి నిలదీస్తాం. బీజేపీ వ్యక్తి మనకు నష్టం చేశారు.. ఉప ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అరచేత వైకుంఠం చూపారు. దుబ్బాకలో చెల్లని వ్యక్తి.. ఇక్కడ ఎలా చెల్లుతారు. ఎన్నడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి.. అలాంటి వాడు సీఎం. జై తెలంగాణ అనే వాళ్లను కాల్చి పడేస్తా అన్నాడు. 

Read more RELATED
Recommended to you

Latest news