రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!!

-

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె వ్యక్తిగత విషయంలో వేణు స్వామి ప్రథమ పాత్ర పోషిస్తున్నారు అనడంలో సందేహం లేదని చెప్పవచ్చు. ఇక వేణు స్వామి చెప్పిన మాటల ప్రకారం జాతకంలో ఏదో దోషం ఉందనడంతో కాబోయే భర్తను కూడా దూరం చేసుకుంది రష్మిక. అంతలా వేణు స్వామి జ్యోతిష్యాన్ని ఆమె బాగా నమ్ముతుంది అని చెప్పవచ్చు. ఇక అంతే కాదు తన కెరీర్లో పతనం మొదలవకూడదనే కారణం చేత వేణు స్వామితో పలు పూజలు కూడా నిర్వహించింది. ఇక పూర్తిగా ఆయనను నమ్ముతున్న రష్మిక అతడు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఆమె ఏ పార్టీలో చేరుతుంది.. ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తుంది.. అనే విషయాన్ని చెప్పడంతో పాటు ఆమె కచ్చితంగా ఎంపి స్థానాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ బల్ల గుద్ది చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల వేణు స్వామి హైదరాబాదులో రష్మిక నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇక దాంతోనే దశ తిరిగిందని, ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్ గా మారిందని, సుమారుగా 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది అంటూ వేణు స్వామి వెల్లడించారు.

అంతేకాదు రష్మిక గురించి ఆయన మాట్లాడుతూ… రష్మిక తన జాతకరీత్యా మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఆమె త్వరలోనే ఎంపీ కూడా అవుతుంది. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎంపిక అవుతారు . ఇక ఆమె జాతకంలో ఇది రాసి ఉంది. ఆమెకు రాజకీయ యోగం ఉంది అంటూ ఆమె గురించి పలు విషయాలు వెల్లడించారు వేణు స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news