ఆయనకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు.. హైకమాండ్ పై వీహెచ్ సంచలనం

-

కాంగ్రెస్ అధిష్టానంపై మరోసారి వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కొత్త వారికి ఇచ్చి మా ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తే.. పరిణామాలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేమని ప్రశ్నించారు. నిన్న మొన్న పార్టీ లోకి వచ్చిన వారికి పీసీసీ ఇస్తే.. మా ఆత్మగౌరవం దెబ్బతింటదని విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా.. అదృష్టం బాగుండి కొనసాగుతున్నాడని.. ఇప్పుడు కొత్త పీసీసీ నియమించబోతున్నారన్నారు. కర్ణాటకలో కొత్త పీసీసీ కోసం పరిశీలకుడిని పంపించారని.. ఇప్పుడు పంజాబ్ లో కూడా అదే జరుగుతోందని.. తెలంగాణలో పీసీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించబోరని ప్రశ్నించారు. మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేస్తడా?ఈ రోజు.. తెలంగాణలో పీసీసీ కోసం బయట నుంచి వచ్చిన వారికి ఇస్తామంటున్నారని మండిపడ్డారు.

ఇది జరిగితే మా ఆత్మగౌరవం దెబ్బతినదా.. మొదటి నుంచి ఉన్న వారి పరిస్థితి ఏంటి?పీసీసీని పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకు ఇవ్వాలన్నారు. బీజేపీ జనరల్ సెక్రటరీలు వస్తే వారి పార్టీ కోసం కష్టపడుతున్నారు.. కానీ మా పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయడని ఫైర్ అయ్యారు. నేను లెటర్ రాస్తే తప్పుపడుతున్నారు.. 2018 నుంచి ఒక్క రివ్వూ లేదని.. నన్ను ఫోన్లు చేసి తిడుతుంటే ముఖ్య నేతలు ఖండించరేమని నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడు పట్టనట్లువ్యవహరిస్తున్నాడని..తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపున ఒక్క ఉద్యమం చేశారా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మేల్కొనండి.. మతతత్వ బీజేపీ లేస్తోందని.. దాన్ని నిలువరించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news