“ఫేక్ వీడియో లపై కేంద్రం రియాక్షన్” స్పందించిన రౌడీ హీరో!

-

గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రస్మిక మందన్న కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరూ చూశారు. ప్రముఖులు అంతా ఈ వీడియో పై స్పందించగా… ఎట్టకేలకు నిన్న కేంద్ర ప్రభుత్వం చాలా ఘాటుగా స్పందించింది. ఇక మీదట ఇలా ఫేక్ వీడియో లో క్రియేట్ చేసి వైరల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై రౌడీ హీరో విజయ దేవరకొండ స్పందించడం విశేషం… భారత్ భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన స్టెప్ ను తీసుకున్నారు, ఇప్పుడు రష్మిక కు జరిగిన విధంగా ఇక మీదట ఎవ్వరికీ జరగకూడదు అంటూ విజయ్ ఫైర్ అయ్యారు, అంతేకాకుండా ఇలాంటివి చేసే వారిపై ప్రత్యేకంగా సైబర్ వింగ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోరారు విజయ్.

ఇక విజయ్ కామెంట్ పై అందరూ మెచ్చుకుంటున్నారు.. ఇంకా కొందరు అయితే రష్మిక తన ఫ్రెండ్ కాబట్టి రెస్పాండ్ అయ్యాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news