జీహెచ్ఎంసీ హాల్ నుండి అలిగి వెళ్ళిపోయిన పీజేఆర్ కుమార్తె !

-

ఈరోజు గ్రేటర్ మేయర్ ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్పొరేటర్ ల ప్రమాణ స్వీకారం జరిగింది. బాషా ప్రకారం గ్రూపులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.  మొత్తం 149 మంది కార్పొరేటర్లు హాజరు కాగా 31 మంది ఎక్స్ ఆఫీసియో హాజరు అయ్యారు. ముందుగా తెలుగులో ప్రమాణ స్వీకారం, ఆ తరువాత ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. 12.30 కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.

ఇప్పటికే మేయర్ ఛాంబర్లో టీఆరెస్ సభ్యుల భేటీ అయ్యారు. మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక పై సమాలోచనలు జరుగుతున్నాయి. సీల్డ్ కవర్ లో GHMC మేయర్ గా బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయ లక్ష్మి పేరు, డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్  మోతే శ్రీలత రెడ్డి పేరు ఉండడంతో కార్పొరేటర్ విజయారెడ్డి(పీజేఆర్ కుమార్తె) జిహెచ్ఎంసి నుంచి బయటకు వెళ్ళిపోయారు. మేయర్ ఎన్నిక సమయంలో వస్తారో లేదో అనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news