ఇది ఆరంభం మాత్రమే : విజయసాయిరెడ్డి

-

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాస్త ఆలస్యం అయితే అయింది కానీ అరెస్ట్ మాత్రం పూర్తి ఆధారాలతో జరిగిందని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. చంద్రబాబు అండ్ కో జీవితాంతం జైలులో ఉండాల్సినన్ని స్కాంలకు పాల్పడ్డారని విజయసాయి ఆరోపించారు. చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీకి కూడా చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

YSRC leadership irked with MP Vijayasai Reddy's antics

ఇన్నాళ్లూ తప్పించుకోగలిగారు కానీ, ఇక శిక్షా సమయం ఆసన్నమైందని ఉద్ఘాటించారు. “చంద్రబాబు తన హయాంలో 2014-19 మధ్య లెక్కలేనన్ని నేరాలకు పాల్పడ్డారు. వాటిలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఒకటి. ఇందులో అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్, చీటింగ్ అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. స్వలాభాల కోసం చంద్రబాబు ప్రజాధనాన్ని షెల్ కంపెనీలకు మళ్లించాడు. సీమెన్స్ కంపెనీతో ఎంవోయూ పేరిట భారీ కుంభకోణానికి సూత్రధారిగా నిలిచాడు.

ఇది ఇలా ఉంటె, జగన్ సీఎం అయ్యాక అన్నం తినడం మానేసి కేవలం కోర్టుల చేత చివాట్లు తింటున్నారు అంటూ కూడా ఎద్దేవ చేయడం జరుగుతోంది. అయితే ఇదంతా కేవలం కక్ష సాధింపులకు పాల్పడే చేశారు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు బాలకృష్ణ.. కేవలం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టాలన్నదే తమ జీవిత లక్ష్యం అన్నట్లుగా అధికార పార్టీ భావిస్తోందంటూ కూడా తెలియజేస్తున్నారు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడుని ఏ చట్టం కింద అరెస్టు చేస్తారు అంటూ ఒక ప్రకటనలు బాలయ్య అడగడం జరిగింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news