తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు

-

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఇవాళ ఉదయం నంద్యాలో ఆయనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు రోడ్డు మార్గాన తరలించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణించిన చంద్రబాబు కాన్వాయ్ 5 గంటలకు తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి చేరుకుంది. దీంతో తాడేపల్లి సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బలగాలను మెహరించారు.

Arrest Of Chandrababu Naidu: Did AP CID Follow The Law? - Telugu Rajyam

సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొస్తున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సీఐడీ కార్యాలయానికి తరలించారు. సుమారు 2వందల మంది పోలీసులు బందోబస్తును నిర్వహించారు. ఇదిలా ఉండగా చంద్రబాబు తరుఫున వాదించడానికి సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా హుటాహుటినా ఢిల్లీ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ట్‌పోర్టుకు చేరుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news