40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్నాడు : విజయసాయిరెడ్డి

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అగ్రనేతపై విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై ప్రశ్నలు కురిపించారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తవ్వినకొద్దీ అక్రమాలు బయటకు వస్తాయన్నారు. ‘లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్నాడు. ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో? 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే 371 కోట్ల స్కిల్ స్కాంకు పాల్పడ్డాడు. తవ్వేకొద్దీ బయటికొచ్చే ‘ఆస్తి’కలెన్నో…!’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

What Is Vijay Sai Reddy's Position In YSRCP?

నిన్న కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై కేంద్రకారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తప్పు చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. చంద్రబాబు లక్ష్యంగా ఆయన ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా మరోసారి ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు కేసును తప్పుదోవ పట్టించి మరింత జటిలం చేసుకున్నారని పేర్కొన్నారు. ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారని, కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు రిమాండు విధించిందన్న విషయాన్ని లెక్క చేయకుండా మెయింటెయినబుల్ కాని క్వాష్ పిటీషనుతో హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news