పప్పు పాదయాత్రకు పాన్ ఇండియా హీరోలు – విజయసాయి సెటైర్

-

రెండు రోజుల కిందట నారా లోకేష్‌ -హీరో యశ్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, వీరి సమావేశంపై విజయసాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. పప్పు పాదయాత్రకు జనాలు పోటెత్తాలంటే పాన్ ఇండియా మూవీ హీరోలను రప్పించాలంటూ చురకలు అంటించారు. ఉ(య)ష్! వాళ్లు రాకపోతే? హోటళ్లు, షూటింగ్ స్పాట్లకు ఏ దిగ్గజ దర్శకుడి రిఫరెన్సుతోనో లేకేషే వెళ్లి కలవాలి. ఛార్టర్డ్ ఫ్లైట్లు, కోట్లల్లో పారితోషికం అరేంజ్ చేయాలి. ఇదీ బొల్లి నాయుడు స్కెచ్ అని ఎద్దేవా చేశారు.

ఇక అటు చంద్రబాబును కూడా టార్గెట్‌ చేశారు సాయిరెడ్డి. చంద్రం బతుక్కి అన్నీ ప్రీప్లాన్డ్ ఏర్పాట్లే! ఢిల్లీ వెళ్తే విగ్గు, ఇద్దరు గజ్జిగాళ్లని తోడ్కొని పోయే ఏర్పాటు. ఐఎస్బీ మీటింగ్ లాంటిదైతే అప్పట్లో వీపు గోకిన వాళ్లతో గిలిగింతలు. కృత్రిమ బిల్డప్పులు. లక్ష చేయించుకో. ప్రజలు మాత్రం నిన్ను నమ్మే ఛాన్సేలేదు చంద్రం! అంటూ ఫైర్‌ అయ్యారు. నాయకుడంటే స్వేచ్ఛా గాలుల కోసం మట్టిపొరలను చీల్చుకొచ్చే మొక్కలా…మొక్కవోని సాహసంతో ఉండాలి. కానీ, నల్లిలా, నత్తగుల్లలా ప్రతిక్షణం భయం అరల్లో దూరిపోయే ఎవడ్రా నువ్వు విగ్గు-పెగ్గు-గబ్బురాజా? వంశం, పరంపర గురించి మాట్లాడే అంత గొప్ప నాయకుడివారా నువ్వు? అట్లతద్ది వెధవ! అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news