రేవంత్ రెడ్డి పై సీనియర్ల తిరుగుబాటు..కాంగ్రెస్ లో టీడీపీ వాళ్లకు పదవులంటూ!

-

టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్‌ నేతలు తిరుగుబాటుకు రెడీ అయ్యారు. ఇటీవల పీసీసీ కమిటీ నియామకంపై కాంగ్రెస్ సీనియర్‌ నేతలు రేవంత్‌ పై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సమావేశం నిర్వహించి.. మీడియాతో మాట్లాడారు.

ఇక ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ, కాంగ్రెస్లో పుట్టి..పెరిగి.. భావజాలం నమ్మిన అనేక మందికి కమిటీ ఏర్పాటులో ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు. చాలా మంది పర్సనల్ గా వచ్చి కలుస్తున్నారని.. అసలు కాంగ్రెస్ నాయకులకు ..వలస వాదులకు వ్యత్యాసం వచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్ లో టీడీపీ వాళ్లకు పదవులు వచ్చాయన్నారు.

వలస వాదులతో అసలు వారికి నష్టం జరిగిందని.. జిల్లాల వారిగా మాతో మాట్లాడాలి కదా అని నన్ను అడిగారన్నారు. ఇక అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటానన్న వెంకటరెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయానికి కోమటిరెడ్డి మద్దతు ప్రకటించారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్‌ నేతలు మొత్తం.. రేవంత్‌ రెడ్డిపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరి దీనిపై రేవంత్‌ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news