అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన విజయసాయిరెడ్డి !

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి…ఈయన ఎప్పుడూ.. సోషల్‌ మీడియా యాక్టివ్‌ గా ఉంటారు. అంతేకాదు.. ఎప్పుడూ…చంద్రబాబు, నారా లోకేష్‌ లపై ట్వీట్ల‌తో విరుచుకుపడతారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అయితే…. తాజాగా అల్లు అర్జున్‌ ను జాకీలు పెట్టి… లేపే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. తాజాగా సీమా అవార్డులలో.. బన్నీ నటించిన పుష్ప సినిమా బంపర్‌ విజయాన్ని అందుకుంది. అయితే.. ఈ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రశంసలు కురిపించారు.

పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న ‘పుష్ప’ చిత్రం యూనిట్ కు అభినందనలు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతం. తెలుగు సినిమా ‘తగ్గేదే లే’ అని నిరూపించారంటూ ట్వీట్ చేశారు సాయిరెడ్డి. అయితే… విజయసాయి చేసిన ట్వీట్‌ తో అల్లు, మెగా ఫ్యాన్స్‌ మధ్య వివాదం చెలరేగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ ను తక్కువ చేయాలనే..ఉద్దేశ్యంతో సాయిరెడ్డి…ట్వీట్‌ చేశారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news