ఆంధ్రలో కేసీఆర్ కు రాళ్లు, చెప్పులతో స్వాగతం – విజయశాంతి

-

ఆంధ్రలో కేసీఆర్ కు రాళ్లు, చెప్పులతో స్వాగతం పలుకుతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. ఏపీలో బీఆరెస్, తెలంగాణలో టీడీపీ అనే అంశంపై ఈ రోజు కొందరు తెలంగాణ ఉద్యమ మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా… తెలంగాణలోకి జగన్మోహన్ రెడ్డిగారి పార్టీ రాదన్నారు. తెలంగాణ ప్రజలకు ఆ సమస్య లేదని పేర్కొన్నారు విజయశాంతి.

ఆంధ్రలో కేసీఆర్ గారిని రాళ్లు, చెప్పులతో రానిస్తరన్నట్లు సోషల్ మీడియా వార్తలు వస్తున్నయి కాబట్టి, అది కేసీఆర్ గారి బీఆరెస్ సమస్య తప్ప, తెలంగాణకు సంబంధించింది కాదన్నారు. ఏపీని విడిచిపెట్టి చంద్రబాబు గారు తెలంగాణలోకి ఎందుకు వస్తున్నరో, రెండు రాష్ట్రాల ప్రజలకూ అర్థం కావట్లేదని వెల్లడించారు. ఈ మొత్తం సందిగ్ధతను గత కొన్ని నెలలుగా బీఆరెస్, టీడీపీలు తయారు చేసినందువల్ల… సమాధానం వారిద్దరే చెప్పాలని డిమాండ్‌ చేశారు విజయ శాంతి.

 

Read more RELATED
Recommended to you

Latest news