కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి : విజయశాంతి

-

హైదరాబాద్ గంజాయికి అడ్డాగా మారిందని…అందుకే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని విజయశాంతి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరం గంజాయికి అడ్డాగా మారిందని… న‌గ‌రంలో ఎక్క‌డబడితే అక్క‌డ గంజాయి దొరుకుతుందని ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా డ్రగ్స్ అమ్ముతున్నారని.. గ‌తంలో డ్రగ్స్ పై హ‌డావిడి చేసిన పోలీసులు ఇప్పుడు చోద్యం చూస్తున్నారని నిప్పులు చెరిగారు.

పోలీసుల‌తో పాటు ప్ర‌భుత్వం కూడా దీని గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. డ్రగ్స్‌తో పాటు గుట్టు చ‌ప్పుడు కాకుండా బెల్ట్ షాపులు కూడా నిర్వ‌హిస్తున్నారన్నారు. బెల్ట్‌ షాపులు, గుడుంబా బస్తీల్లోని పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. గుట్టుగా గంజాయి సరఫరా అవుతుండడంతో యువత నిత్యం మత్తులో మునిగి తేలుతున్నారని ఆమె వెల్లడించారు.

గతంలో మద్యం మత్తులో అనేక హత్యలు, కొట్లాటలు జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారు. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రీ పగలు అనే తేడా లేకుండా బెల్ట్‌షాపులు తెరిచి ఉండడం, విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతుండడంతో యువత మత్తులో మునిగి తేలుతున్నారని ఆగ్రహించారు. ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్ స‌ర్కార్ మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. ఇప్పటికైనా అక్రమంగా మద్యం, గుండుంబా, గంజాయి విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని… ప్ర‌జ‌ల బ‌తుకుల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కార్‌ను ఈ ప్ర‌జ‌లే బంగాళాఖాతంలో కలప‌డం ఖాయమని హెచ్చరించారు. విజయశాంతి

Read more RELATED
Recommended to you

Latest news