విజయవాడ కు డ్రగ్స్ కు సంబంధం లేదు : సీపీ శ్రీనివాసులు

-

విజయవాడ కు డ్రగ్స్ కు సంబంధం లేదని సీపీ శ్రీనివాసులు అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని..డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టామని తెలిపారు.
విజయవాడ కి.. డ్రగ్స్ కి.. ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన బల్ల గుద్ది చెప్పారు. కానీ ఇక్కడ అడ్రస్ ని 2 సార్లు ఉపయోగించారని…డ్రగ్ రాకెట్ అంతా ఢిల్లీ కేంద్రంగా జరిగిందని స్పష్టం చేశారు. యాక్టివ్ గా ఉన్న 18 మంది రౌడీ షీటర్స్ ను బహిష్కరించామని…కొత్తగా 116 మంది పై షీట్స్ తెరిచామని శ్రీనివాసులు స్పష్టం చేశారు. తరచుగా కౌన్సిలింగ్ చేస్తున్నామని….3 వేల మంది పై సస్పెక్ట్ షీట్స్ పెట్టి, అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ ముందు పెట్టామని ఆయన వెల్లడించారు.

14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మందిని అరెస్ట్ చేసామని సీపీ స్పష్టం చేశారు. 6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకుని 570 మంది పై చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. 8 వేల కేజీల గంజాయి సీజ్ చేసి, 250 కేసులు పెట్టామని తెలిపారు. 570 గంజాయి వాడకం దార్లును గుర్తించి కౌన్సిలింగ్ చేసి వారిలో మార్పు తెచ్చామని వెల్లడించారు.కాలేజి లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని…కొండపల్లి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టామని సీపీ వెల్లడించారు. కొండపల్లి ఎన్నికల్లో రాజకీయపార్టీలు, అభ్యర్థులు సహకరించాలని…కోడ్ ఆప్ కండక్ట్ పాటించాలని సీపీ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news