బెజ‌వాడ గ్యాంగ్‌వార్ : సందీప్ భార్య చెప్పిన సంచలన విషయాలు..!

-

విజయవాడ పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్‌ ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ లో తోట సందీప్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటినుండి ఈ కోసులో రోజుకో సంచలన విషయం బయటపడుతుంది. తాజాగా..దీనిపై సందీప్ భార్య తేజస్విని మీడియాతో మాట్లాడుతూ… సందీప్ ను పక్కా స్కెచ్ తో హత్య చేశారని ఆరోపించింది. ల్యాండ్ సెటిల్మెంట్ కు, సందీప్ కు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. సందీప్ హత్య వెనుక రాజకీయ నేతల పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేసింది. గ్యాంగ్ వార్ కు ముందు ఒకరోజు ఫోన్ లో బెదిరించారని తెలిపింది. సందీప్ హత్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని తేజస్విని విజ్ఞప్తి చేసింది. సందీప్ హత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news