దయనీయం.. వెలివేసిన గ్రామస్తులు.. స్మశానంలో క్వారంటైన్‌

-

కరోనా వైరస్ రోజురోజుకు మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకుతుందేమో అనే భయంతో మనుషులు ఏం చేస్తున్నారో కూడా వాళ్లకి అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఓ గ్రామంలో జరిగిన ఘటన ఎంతోమంది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఇద్దరు మహిళలకు ఇద్దరు పురుషులకు కరోనా సోకడంతో వారిని గ్రామం నుంచి వెలి వేశారు.

coronavirus

ఇక అక్కడ గ్రామంలో నిర్మించిన స్మశానవాటికలో వాటికలో వారిని ఉంచారు. అక్కడికే వైద్య సిబ్బంది మందులు తీసుకురావడంతో పాటు ఆహారం కూడా అక్కడికి తీసుకు వస్తున్నారు.ఓ వైపు కరోనా సోకి భయంతో వణికిపోతూనే మరోవైపు స్మశానవాటికలో గడపాల్సిన దుస్థితిలో బాధితులు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే సొంత ఊర్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి అని ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news