బీచ్‌లో కూతురితో విరుష్క జంట.. ఫొటో వైరల్

-

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. గతేడాది చివర్లో దుబాయ్‌ వెళ్లిన విరుష్క జంట అక్కడ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు.

ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌ ఆశ్రమాన్ని సందర్శించారు. తాజాగా, కుమార్తె వామికతో కలిసి బీచ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కోహ్లీ తన సామాజిక మాధ్యమాల్లోని ఖాతాల్లో పోస్టు చేశాడు.

కూతురు వామిక చేతులు పట్టుకుని విరాట్- అనుష్క జంట బీచ్‌లో నడుస్తున్న ఓ క్యూట్‌ ఫొటోను పంచుకున్న కోహ్లీ.. ‘దేవుడా.. ఇప్పటి వరకు మమ్మల్ని ఆశీర్వదించావు. ఇతర కోరికలేమీ లేవు. నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్ ఈ ఫ్యామిలీ ఫొటో చూసి తెగ ఖుష్ అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news