దరిద్రులు… కరోనా శవాలను కూడా వదలడం లేదు…!

-

కొంతమంది కరోనా సమయంలో అనుసరిస్తున్న వైఖరి చూస్తే భయమేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం వేలు వసూలు చేసేవి లక్షలు వసూలు చేయడం వంటి చర్యలు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ కేజీహెచ్ సిఎస్ఆర్ కోవిడ్ బ్లాక్ లో దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ తో చనిపోయిన మృతదేహాలు నుండి ఆభరణాలు, వస్తువులు మాయం అవుతున్నాయి.

అడిగితే.. తమకు తెలియదని, హెల్ప్ డెస్క్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా వందల మంది ఫిర్యాదు చేశారని, ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం అని బాధితులు అంటున్నారు. మేమేం చేయలేం అని సిబ్బంది అంటున్నారు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఆస్పత్రికి వచ్చిన వారిని పోలీసులు తరిమేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news