బిజెపి ముందు విఠలాచార్య సినిమాలు పనిచేయవు – కిషన్ రెడ్డి

-

టిఆర్ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్రమంత్రిి కిషన్ రెడ్డి. బిజెపి ముందు విఠలాచార్య సినిమాలు పనిచేయవని అన్నారు. ఢిల్లీలోని ఆర్ట్స్ గ్యాలరీ భవన్ లో అక్బర్ సాహెబ్ ఆర్టిస్ట్ చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. అక్కడ మోడీ చిత్రాలతో పాటు 50 కి పైగా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రారంభోత్సవం అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కధలు అల్లారని.. కోట్ల రూపాయలు దొరికాయిని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అసలు పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ గ్రేట్ మాస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రులను చేయలేదా అని ప్రశ్నించారు. నందు తెలుసు కానీ.. ఆయన తన అనుచరుడు కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు నందు టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రభుత్వం పడిపోతుందా? అని ప్రశ్నించారు. ఎవరైనా పదవులకు రాజీనామా చేస్తేనే బిజెపిలో చేర్చుకుంటామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో కాకుంటే.. లండన్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news