వివేకా మర్డర్ కేసు: అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ విచారణ రేపటికి వాయిదా !

-

కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎన్నో మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసి కొందరిని రిమాండ్ కు తరలించారు, వారిలో వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి మరియు తండ్రి భాస్కర్ రెడ్డి లు ఉన్నారు. కాగా త్వరలోనే అవినాష్ రెడ్డిని సైతం సిబిఐ అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి ముందుగానే బెయిల్ కు తెలంగాణ హై కోర్ట్ లో పిటీషన్ వేశారు. అయితే దాదాపుగా మూడు వారాల నుండి ఈ బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపున లాయర్ లు , ఇవ్వడానికి వీలు లేదని సిబిఐ మరియు సునీత తరపున లాయర్ లు పోరాడుతున్నారు.

ఇక దీనిపైన విచారణ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ పోతోంది కోర్ట్. ఈ రోజు విచారణ జరగాల్సి ఉండగా… ఈ రోజు కోర్ట్ విచారించే కేసుల జాబితాలో అవినాష్ రెడ్డి కేసు లేకపోవడంతో ఇక రేపటికి వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news