అఖిల్ సినిమాలో చేసిన అతి పెద్ద తప్పు అదే అంటున్న వివి.వినాయక్..!!

-

మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆది సినిమాతో దర్శకుడి గా అడుగుపెట్టిన వివి వినాయక్.. ఆ తర్వాత.. దిల్, చెన్నకేశవరెడ్డి, లక్ష్మి, సాంబ తదితర సినిమాలకి దర్శకుడి గా వ్యవహరించి.. మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో డైరెక్టర్ గా పేరుపొందారు వివి వినాయక్. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే తమ వారసులు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే అది కేవలం వివి వినాయక వల్ల సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అలా నాగార్జున కుమారుడైన అఖిల్ ను, బెల్లంకొండ సాయి ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

నాగార్జున కుమారుడు అఖిల్ ని లాంచ్ చేస్తున్న సమయంలో అఖిల్ సినిమాని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా నిరాశపరిచింది. ఈ సినిమా సగటు ప్రేక్షకుడనే కాదు అక్కినేని అభిమానులను కూడా అంతగా మెప్పించలేకపోయింది. ఇక పరాజయానికి తాను చేసిన తప్పులను నిజాయితీగా ఒప్పుకున్నారు వినాయక్. వివి వినాయక్ మాట్లాడుతూ ఒక బడా హీరో కొడుకుతో సినిమా తీస్తున్నాను కాబట్టి .. కథ ఇలా ఉండాలి అలా ఉండాలని ఆలోచించలేదు.. అనుకున్నది అనుకున్నట్లుగానే తీసి ఉంటే సినిమా ఫలితం మరొక లాగా ఉండేది అని తెలిపారు.

స్టార్ హీరో కొడుకు కదా మొదటి సినిమా సింపుల్ గా లవ్ స్టోరీ లాగా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది.. కానీ యాక్షన్ సినిమా కావడంతో ఆ సినిమా ఫ్లాప్ అయిందని తెలిపారు.. కానీ ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయంలో సక్సెస్ అయ్యాను అంటూ తన తప్పులను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం వీవీ వినాయక్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో బాలీవుడ్లో తెలుగు చత్రపతి సినిమాను రీమిక్స్ చేయడం జరుగుతోంది. ఈ సినిమా పూర్తి అయ్యాక ప్రమోషన్ చేయాలని భావిస్తున్నట్లుగా వీవీ వినాయక్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news