విశాఖపట్నం నుండి కేరళ టూర్ ప్యాకేజీ.. ఈ ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు..!

-

మీరు కేరళ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే మీకు గుడ్ న్యూస్. విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీ సీటూరిజం. విశాఖపట్నం నుండి కేరళ వెళ్లి వచ్చేయచ్చు. మెస్మరైజింగ్ కేరళ పేరుతో ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు చూస్తే.. కొచ్చి, మున్నార్, అలెప్పీ లేదా కుమారకోమ్, త్రివేండ్రం ని చూసి వచ్చేయచ్చు.

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. 2023 అక్టోబర్ 14న కేరళ టూర్ మొదలు కానుంది. ఈ ప్యాకేజీ తో హౌజ్‌బోట్‌లో కూడా స్టే చెయ్యచ్చు. మొదటి రోజు విశాఖపట్నంలో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 7.40 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.20 గంటలకు కొచ్చిన్ రీచ్ అవుతారు.

కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం మెరైన్ డ్రైవ్, బోటింగ్ కి వెళ్లి… సాయంత్రం లులు మాల్ చూడొచ్చు. రాత్రికి కొచ్చిలో ఉండాలి. రెండో రోజు కొచ్చి సైట్‌సీయింగ్. డచ్ ప్యాలెస్, సెయిన్ ఫ్రాన్సిస్ చర్చ్, సాంటా క్రూజ్ బసిలికా ని చూడచ్చు. తర్వాత మున్నార్ బయల్దేరాలి. రాత్రికి మున్నార్‌లో ఉండాలి. మూడో రోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్ ని చూడవచ్చు. మ్యూజియం, మెట్టుపట్టి డ్యామ్, ఈకో పాయింట్, కుండల లేక్ చూసి రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. నాలుగో రోజు ఉదయం టీ మ్యూజియం.

తర్వాత కుమారకోమ్ లేదా అలెప్పీ బయల్దేరాలి. హౌజ్‌బోట్‌ లో బస చేయొచ్చు. ఐదో రోజు త్రివేండ్రం లేదా కోవలం వెళ్లాల్సి ఉంది. అఝిమల ఆలయం, కోవలం బీచ్ చూడొచ్చు. రాత్రికి త్రివేండ్రం లేదా కోవలంలో బస చేయాలి. ఆరో రోజు ఉదయం శ్రీ పద్మనాభస్వామి అలయం చూడొచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం. ఉదయం 10.15 గంటలకు త్రివేండ్రంలో బయల్దేరితే రాత్రి 1.55 గంటలకు వైజాగ్ వచ్చేయచ్చు. ధర విషయానికి వస్తే.. ధర రూ.38,110, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.40,925, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.56,635 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news