హైదరాబాద్ పబ్ లకు వార్నింగ్…!

-

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని పలు పబ్ లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ ల పై కొరడా ఝుళిపించారు. అర్ధరాత్రి వరకు పబ్బులు ఓపెన్ చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. నిబంధనలు బేఖాతరు చేస్తున్న పబ్ లను గుర్తించారు. నాలుగు పబ్ ల పై ఆకస్మికంగా దాడి చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు… అక్కడ జరుగుతున్న వ్యవహారాలను గుర్తించారు.

తబలారస, ఎయిర్ లైవ్, కేమేస్ట్రీ, మరియు అమ్మేసియా పబ్ ల పై దాడులు చేసి కేసులు నమోదు చేసారు. అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్ ని తెచ్చిన పబ్ ల మీద కేసులు నమోదు చేసారు. కరోనా నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేస్తున్నట్టు గుర్తించారు. మాస్కులు ధరించకుండానే వచ్చినవారికి సర్వీస్ చేస్తున్న తీరుని గుర్తించారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే విధానానికి స్వస్తి చెప్పినట్టు పోలీసుల దృష్టికి రావడంతో వారి మీద చర్యలకు దిగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news