వైసీపీకి ఓటు వేయని వారికి కూడా పథకాలు అమలు చేస్తున్నాం – సీఎం జగన్

-

వైయస్సార్ కడప జిల్లా రెండవ రోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. వైసిపికి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తున్నామన్నారు.

పులివెందులలో వైయస్సార్ బస్ టెర్మినాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. పులివెందులలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2023 నాటికి పూర్తవుతుందన్నారు. ఒక చెడిపోయిన వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు సీఎం. కావాలనే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి అన్నారు. అవినీతికి తావు లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news