మేము రెడీగానే ఉన్నాం: కేసీఆర్ ప్రకటన

-

ధరణి పోర్టల్ పై సిఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేత ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేసారు. నేడు ఆయన ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేసారు. కరోనా మీద కూడా ఆయన సమీక్ష నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news