VRA ల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తాం – రేవంత్ రెడ్డి

-

రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ అశోక్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఎవరు ఆందోళనకు గురి కావద్దని.. ప్రభుత్వంతో పోరాడుదామని సూచించారు.

ఈ అంశంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో మాట్లాడి అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. వీఆర్ఏల సమస్యలపై ముఖ్యమంత్రికి వివరంగా లేఖ రాస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news