క‌రెన్సీని ముద్రించి అంద‌రికీ పంచితే పేద‌రికం ఉండ‌దు క‌దా.. ఆ ప‌ని ఎందుకు చేయ‌రు..?

-

గుండు సూది ద‌గ్గర్నుంచి.. విమానం దాకా.. నిరుపేద‌ల నుంచి ధ‌నికుల దాకా.. అంద‌రిని న‌డిపిస్తుందీ.. అందరికీ కావ‌ల్సిందీ.. ఒక్క‌టే.. డ‌బ్బు.. డ‌బ్బు లేనిదే ఈ ప్ర‌పంచంలో ఏ ప‌నీ కాదు. మ‌నిషి డ‌బ్బు కోసం ఏ ప‌నైనా చేస్తాడు. పేద‌వాడు ఒక్క పూట తిండి కోసం డబ్బు సంపాదించాల‌ని చూస్తాడు. ధ‌నికులు ఖ‌జానాల్లో ఉన్న త‌మ ధ‌నం రెట్టింపు కావాల‌ని చూస్తుంటారు. అయితే.. ప్ర‌పంచంలోని దేశాల‌న్నీ.. త‌మ‌కు కావ‌ల్సినంత క‌రెన్సీని ప్రింట్ చేసుకుని.. పేద‌లంద‌రికీ పంచ‌వ‌చ్చు క‌దా.. అప్పుడు పేద‌లంటూ ఉండ‌రు క‌దా.. ఈ క‌ష్టాలు, క‌న్నీళ్లు ఉండ‌వు క‌దా.. అని కొంద‌రు ఆలోచిస్తుంటారు. ప్ర‌భుత్వాలు అలా ఎందుకు చేయ‌వు..? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తుంటారు. అయితే అందుకు స‌మాధానాన్ని ఇక్క‌డ తెలుసుకోండి..!

what happens if government prints currency and gives it to poor

సాధార‌ణంగా ఏ దేశ‌మైనా స‌రే.. క‌రెన్సీ ముద్ర‌ణ‌లో కొన్ని పాల‌సీల‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఇక మ‌న దేశం కూడా అంతే.. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మ‌న దేశంలో ఎంత న‌గ‌దు ఉందీ, ఎంత ముద్రించాలి.. అన్న వివ‌రాల‌ను ఎప్ప‌టికప్పుడు ప‌రిశీలిస్తూ.. కరెన్సీని ముద్రించి చెలామ‌ణీలోకి తెస్తుంది. మ‌న దేశంలో ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వ‌ల ఆధారంగా క‌రెన్సీ ముద్ర‌ణ అనేది జ‌రుగుతుంది. ఇక ఇత‌ర దేశాల వారు కూడా త‌మ పాల‌సీల ప్ర‌కారం క‌రెన్సీని ముద్రిస్తుంటారు. కానీ ఎవ‌రూ.. అతిగా క‌రెన్సీని ముద్రించ‌రు. ఎందుకంటే…

ఉదాహ‌ర‌ణ‌కు మ‌న దేశంలో పెద్ద ఎత్తున క‌రెన్సీని ముద్రించి అంద‌రికీ కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇచ్చార‌నుకుందాం.. అప్పుడేమ‌వుతుంది. అంద‌రూ.. ధ‌నికులు అవుతారు.. స‌హ‌జంగానే జ‌నాల్లో ప‌నిచేసే త‌త్వం పోతుంది. ఆహార‌, వ‌స్తువుల ఉత్ప‌త్తి తగ్గుతుంది. డిమాండ్ పెరుగుతుంది. ధ‌ర‌లు పెరుగుతాయి. అలా కొంత కాలం న‌డుస్తుంది.. ఆ త‌రువాత ఆహారం దొర‌క‌దు. ఒక్క తిండి గింజ కోసం త‌న్నుకునే రోజులు వ‌స్తాయి.. ఇది అస‌లు ఏమాత్రం మంచిది కాదు. గ‌తంలో జింబాబ్వే కూడా స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంది. అక్క‌డ అవ‌స‌రం లేకున్నా పెద్ద ఎత్తున క‌రెన్సీని ముద్రించారు. ఉత్పత్తి త‌గ్గింది. ద్రవ్యోల్బ‌ణం పెరిగింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్య‌వస్థ కుప్ప‌కూలింది.

అలాగే ఏ దేశంలో అయినా స‌రే.. అవ‌స‌రానికి మించి క‌రెన్సీని ముద్రించి చెలామ‌ణీ చేస్తే.. జింబాబ్వేలో జ‌రిగిన‌ట్లే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. ఉత్ప‌త్తి త‌గ్గి అన్నింటి ధ‌ర‌లు పెరుగుతాయి. అప్పుడు రూ.10 ఉండే బియ్యం ధ‌ర ఏకంగా రూ.100 అవుతుంది.. దీంతో ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న సంప‌ద వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే కొద్దీ త‌రిగిపోతుంది.. అప్పుడు ప్ర‌జ‌లంద‌రూ మునుప‌టి క‌న్నా ఇంకా పేద‌రికంలోకి వెళ్లిపోతారు. అలాంట‌ప్పుడు కరెన్సీని ఎక్కువ‌గా ముద్రించి.. అంద‌రికీ పంచాల్సిన అవ‌స‌రం లేదు క‌దా.. అందుక‌నే ప్ర‌భుత్వాలు ఆ ప‌ని చేయ‌డం లేదు.. చేయ‌వు కూడా.. అది ప్ర‌జ‌ల‌కే కాదు, దేశ భ‌విష్య‌త్తుకూ అనర్థ‌దాయ‌కం..!

Read more RELATED
Recommended to you

Latest news