ఏ రాజకీయ పార్టీ చేయాలని సాహసం వైసిపి చేస్తోంది – మంత్రి కాకాని

-

నెల్లూరు జిల్లాలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై వైసిపి నేతలు, ప్రజా ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జెడ్.పి. ఛైర్ పర్సన్ అనం అరుణమ్మ, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, డీసీసీబీ మాజీ చైర్మన్ అనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా “జగనన్నే మా భవిష్యత్తు”.. “మా నమ్మకం నువ్వే జగన్”.. కార్యక్రమం పై లబ్దిదారుల మనోగతాన్ని వివరించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.

జిల్లాలో 62 లక్షల 24 వేల కుటుంబాలకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా రీచ్ అయ్యామన్నారు. గ్రామ, మండల , జిల్లా స్థాయిల వారీగా ఈ కార్యక్రమాన్ని విజవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. 7 లక్షల మంది కార్యకర్తలతో కోటి 60 లక్షల ఇళ్లు చుట్టేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం వై.సి.పి చేస్తొందన్నారు కాకాని. సంక్షేమ పథకాలను వివరిస్తూ.. గడప గడపకు తిరుగుతున్నామన్నారు. సామాన్య ప్రజలతో పాటు లబ్ది పొందిన టిడిపి సానుభూతి పరులు కూడా ఇంటికి స్టికర్లు అంటించుకుంటున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news