బ్రేకప్ అయ్యాక అమ్మాయిలంటే భయమేస్తుంది.. సాయిధరమ్ తేజ..

-

టాలీవుడ్ హీరో, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల పైనే పెట్టారు. తాజాగా ఈయన నటించిన విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్ర ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో ప్రేమ, పెళ్లి విషయంపై పలు ప్రశ్నలు ఎదురవగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఎవరెవరో అడుగుతున్నారని ఏదో అనుకుంటారని పెళ్లి చేసుకోనంటూ చెప్పుకొచ్చిన సాయి ధరమ్ తేజ్ నాకు కరెక్ట్ గా సెట్ అయ్యే అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నారు. అయితే తనకు కొన్నాళ్ల క్రితం బ్రేకప్ అయిందని ప్రస్తుతం అమ్మాయిలు అంటేనే భయమేస్తుందని చెప్పుకు వచ్చిన ఈ హీరో బ్రేకప్ తర్వాత చాలా సైలెంట్ అయిపోయానని తెలిపారు.

 

కాగా విరూపాక్ష సినిమా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో వస్తుంది. ఈ సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించ‌టం విశేషం. అలాగే ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ కూడా పార్ట్ అయ్యింది. విరూపాక్ష సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది.  కాగా ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. తమిళంలో డైరెక్ట్ చేసి, నటించి హిట్ కొట్టిన సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. గతనెల ఫిబ్రవరి 22న అధికారికంగా లాంచ్ అయి షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. కాగా ఓ యువకుడు కారు యాక్సిడెంట్ లో మరణిస్తే దేవుడు అతనికి రెండో అవకాశం ఇస్తాడు. తమిళంలో ఇదే కాన్సెప్ట్ గా రాగా తెలుగులో సైతం ఇదే నేపద్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జులై 28న విడుదలకానుంది

Read more RELATED
Recommended to you

Latest news