చంద్రబాబు, యనమల ఎక్కడ దాక్కున్నారు – మంత్రి అప్పలరాజు

-

టిడిపి అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి సిదిరి అప్పలరాజు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు కు సహాయం అందించారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి లంక గ్రామాల్లో నడిచి ప్రజలతో నేరుగా మాట్లాడింది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు ఖచ్చితంగా 175 గెలుస్తామని భీమా వ్యక్తం చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.

ఏపీ ఆర్థిక పరిస్థితి పై, అప్పులపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసిన రాష్ట్రాల అప్పులు కనిపించలేదా, వినిపించలేదా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు మీడియా ముందుకు రావాలని అన్నారు. చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో చేసిన డ్రామాలు, యాక్షన్ అందరూ గమనించారని.. ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని అన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు.

Read more RELATED
Recommended to you

Latest news