గుజరాత్ లో పీఎం ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడం లేదు? – హరీష్ రావు

-

నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పర్యటనలో భాగంగా నారాయణఖేడ్ లో 50 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్రలో తాగునీటి సమస్య అధికంగా ఉందని అన్నారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ 10 వేలు ఆర్థిక సాయం ఇస్తున్నారని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా, ఎంపీ కిషన్ రెడ్డి నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఎం ఫసల్ బీమా గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news