వైసీపీ గెలవకపోతే ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటాడా : బుద్ధ వెంకన్న

-

నేషనల్ ఛానెల్స్ అన్నీ కూటమి బలాన్ని చెపితే ఆరా మస్తాన్ తో ఫేక్ సర్వే చెప్పించారు.కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా…వైసీపీ గెలవకపోతే ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటాడా అని టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జి, బుద్ధ వెంకన్న సవాల్ విసిరారు.ఆరా మస్తాన్ తో చెప్పించిన దానికి, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే, జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టనని జగన్ చంద్రబాబు కు ఛాలెంజ్ చేయగలడా అని ప్రశ్నించారు.

ఆరా మస్తాన్ సర్వే ఫేక్ సర్వే…అధికారులు అంతర్గతంగా మేనేజ్ చేయాలి అనే సంకేతం ఇచ్చేలా ఆరా మస్తాన్ సర్వే చేశారు.బెట్టింగ్ లు అన్నీ టిడిపి వైపు కాయడానికి, వైసీపీ బెట్టింగ్ లన్నీ వాళ్ళే కాస్తారు.ఎన్నికల ఖర్చును రాబట్టుకోవడానికి బెట్టింగ్ రూపంలో ఆరా మస్తాన్ తో ఆడిస్తున్న మైండ్ గేమ్.ఎవరూ ఆరా మస్తాన్ సర్వే నమ్మొద్దు టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జి, బుద్ధ వెంకన్న అన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారం చేపట్టనుందని జగన్ పార్టీకి 94-104 స్థానాలు రావచ్చని, టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని పేర్కొంది. సంక్షేమ పథకాలతో జగన్కు ఓటర్లు తిరిగి పట్టం కట్టినట్లు ఈ సర్వే పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news