ప్రశ్నించిన 5 కోట్ల‌ మందిపైనా దాడి చేయిస్తారా జ‌గ‌న్‌ గారు? : లోకేష్

-

జగన్ మోహన్‌ రెడ్డి సర్కార్‌ పై , టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించిన 5 కోట్ల‌ మందిపైనా దాడి చేయిస్తారా జ‌గ‌న్‌ గారు? అని ఫైర్‌ అయ్యారు. జ‌గ‌న్‌ పాల‌నలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందని వెల్లడించారు. ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పిన ద‌ళిత మ‌హిళ క‌ర్ల‌పూడి వెంకాయ‌మ్మ‌కి ఈ ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుంది..? అని ఆగ్రహించారు.

వెంకాయమ్మకు స‌మాధానం చెప్పే ద‌మ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు నారా లోకేష్‌. వెంకాయ‌మ్మ‌కి గానీ, ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కి గానీ ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్ర‌ప‌రిణామాలు త‌ప్ప‌వని.. వైసీపీ ద‌గ్గ‌ర వున్న‌ది కిరాయి మూక‌లు..మా ద‌గ్గ‌ర ఉన్న‌ది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్ష‌లాది మంది సైనికులు అన్నారు. నిర‌క్ష‌రాస్య‌, నిరుపేద, ద‌ళిత మ‌హిళ‌ వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్ర‌తీ ఇంటా, ప్ర‌తీనోటా వినిపిస్తోంది. ఐదు కోట్ల‌ మందిపైనా దాడి చేయిస్తారా జ‌గ‌న్‌ గారు? అంటూ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news