రియా చ‌క్ర‌వ‌ర్తికి రేపు బెయిల్ వ‌స్తుందా?

-

సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డిన రియా జ్యుడీషియ‌రీ క‌స్ట‌డీలో వున్న విష‌యం తెలిసిందే. రేపు మంగ‌ళ‌వారం రియా క‌ష్ట‌డీ ముగియ‌బోతోంది. గ‌త కొన్ని రోజులుగా రియా బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. త‌నతో పాటు త‌న సోద‌రుడు షోవిక్ కి బెయిల్ ల‌భించాల‌ని ప్ర‌య‌త్నించినా ఇటీవ‌ల ఆమె అభ్య‌ర్ధ‌న‌ని కోర్టు తిర‌స్క‌రించింది.

అయితే తాజాగా రియా జుడీషియ‌ల్ క‌స్ట‌డి ఈ నెల 6తో ముగుస్తుండ‌టంతో ఆమెకు బెయిల్ మంజూల‌ర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో ప‌క్క బీహార్ ఎన్నిక‌లు ముగిసేంత వ‌ర‌కు రియాకు బెయిల్ ల‌భించే ప్ర‌స‌క్తే లేద‌ని మ‌రో వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.  రియా బెయిల్ విష‌యంలో రేపు ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఉత్కంఠ మాత్రం నెలకొంది.

ఎన్సీబీ అధికారులు ఇటీవ‌ల రియాకు డ్ర‌గ్స్ పెడ్ల‌ర్‌ల‌తో సంబంధాలు వున్నాయ‌ని సుశాంత్ కేసుని ఆ కోణంలో ప‌రిశోధించ‌డం మొద‌లుపెట్టిన ఎన్సీబీ అధికారులు మూడు రోజులు విచారించిన త‌రువాత రియాని అరెస్ట్ చేసి జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ‌

Read more RELATED
Recommended to you

Latest news