టీ20 ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ ?

-

విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, తాజాగా విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయడానికి ముందు సంచలనం నిర్ణయం తీసుకున్నట్టు ఓ వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కోహ్లీ టీ20 ల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడు అన్నదే ఆ వార్త సారాంశం. అంతర్జాతీయ టి20 మ్యాచ్ ల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించిన విరాట్, వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కోహ్లీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకున్నప్పటికీ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. వన్డేలు, టెస్టులపై దృష్టి సారించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news