క్షీణించిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ఆరోగ్యం

-

ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హిరాబెన్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాగా, ఇటీవలే హీరాబెన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా మోడీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

కాగా, నిన్న ప్రధాని మోడీ సోదరుడి కారుకు యాక్సిడెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రధాని మోడీ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. అయితే, ఈ సంఘటన మరువక ముందే, ఆయన తల్లి ఆరోగ్యం క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Latest news