విశాఖ సమ్మిట్ తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది – మాజీమంత్రి బాలినేని

-

విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం జగన్ మొదటి నుంచి ఓ విజన్ తో ముందుకు వెళ్లే నాయకుడని అన్నారు. ఏపీకి పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేసేవారికి చెంపపెట్టులా సీఎం జగన్ సమ్మిట్ తో నిరూపించారని పేర్కొన్నారు.

ఏపీలో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని తెలిపారు. ముఖేష్ అంబానీ లాంటి వ్యాపారవేత్తలు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. ఈ సమ్మిట్ తో లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో టీడీపీ హాయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు మాజీ మంత్రి బాలినేని.

ఏపీని దేశం లోనే అగ్రగామికి నిలబెట్టేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖను క్యాపిటల్ గా నిర్ణయించామన్నారు. డెవలప్ అయిన సిటీని మరింత వేగంగా అభివృద్ది చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే లక్షల కోట్లు కావాలన్నారు. ప్రజలకు సీఎం జగన్ నిర్ణయం సరైనదని అర్దమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news