సూది లేకుండానే.. 12 ఏళ్ల పై వారికి వ్యాక్సిన్

-

దేశంలో 12 ఏళ్ల పై ప‌డిన వారికి వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తుంది. జైడ‌స్ క్యాడిలా రూపొందించిన జైకోవ్- డీ వ్యాక్సిన్ ను ఏడు రాష్ట్రా ల‌లో పంపిణీ చేయ‌డానికి సిద్ధం అవుతుంది. అయితే టీకా సూది లేకుండానే పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేసే విధం గా రూపొందిచారు. అయితే దేశం లో ప‌శ్చిమ బెంగాల్, ఉత్త‌ర ప్ర‌దేశ్, పంజాబ్, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, బీహార్, ఝార్ఘండ్ రాష్ట్రా ల‌లో ఈ టీకా వేయ‌నున్నారు. దీనికి సంబంధించిన క‌స‌రత్తుల‌ను కేంద్రం ఇప్ప‌టి కే మొద‌లుపెట్టింది.

 

అంతే కాకుండా ఈ వ్యాక్సిన్ ను ఆ ఏడు రాష్ట్రాల‌కు పంపిణీ చేసే ముందు.. ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్య‌క‌ర్త ల‌కు శిక్షణ కూడా ఇచ్చామ‌ని ఇటీవ‌ల కేంద్రం తెలిపింది. ఈ వ్యాక్సినేష‌న్ లో భాగం గా కేంద్ర ప్ర‌భుత్వం దాదాపు కోటి జై కోవ్ – డీ వ్యాక్సిన్ ల‌ను కొనుగోలు చేయ‌నుంది. ఒక్కో డోసు కు రూ. 265 ల చొప్పున కొనుగోలు చేయ‌నుంది. ఈ వ్యాక్సిన్ కోసం జెట్ అప్లికేట‌ర్ ప‌రికరం అవ‌స‌రం ఉంటుంది. దానికి కోసం మ‌రో రూ. 93 ఖ‌ర్చు చేస్తుంది. దీంతో ఒక్క డోస్ పై రూ. 358 ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news