బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ ఆరోపణలు.. ఆడియో వైరల్

-

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఓ మహిళ సంచలనం ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఎమ్మెల్యే అనుచరులు మమ్మల్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అయితే పోలీసులు కూడా ఎమ్మెల్యేకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది ఆ మహిళ. వారిపై తప్పుడు కేసులు పెట్టి మూడు రోజులు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి వేధించారని వాపోయింది.

లక్షెట్టిపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దుర్గం చిన్నయ్య తనతో కలిసి మందు తాగాలని తన చేయి పట్టుకొని బలవంతం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయనందుకే తమపై కక్ష తీర్చుకునేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించింది. ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే పై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది ఆ మహిళ. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news