దారుణం : సొంత కొడుకు మీద కన్నతల్లి బ్లేడ్ దాడి !

-

మద్యం మత్తులో మనుషులు ఏం చేస్తున్నారో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే మధ్యాన్ని నిషేధించాలని చాలా రోజులుగా మహిళా సంఘాలు కోరుతున్నా ప్రభుత్వాలు దాని మీద వస్తున్న ఆదాయం గండి పడడం ఇష్టం లేక మద్యం రేట్లు పెంచి మరీ అమ్మే పరిస్థితి ఏర్పడింది. తాజాగా మద్యం మత్తులో ఒక మహిళ తన సొంత కొడుకు మీద బ్లేడుతో దాడి చేయడం సంచలనంగా మారింది.

రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్ తాలూకాలోని గంధంగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కన్నతల్లి కొడుకు మీద బ్లడ్ తో విచక్షణారహితంగా దాడి చేసింది.. బాలుడికి కేకలు విని తల్లిని స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే బాలుడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. తల్లి మద్యం మత్తులో ఉండి ఈ దాడి చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news