వావ్..లతాజీ పాటతో ఆకట్టుకున్న మట్టిలో మాణిక్యం..వీడియో వైరల్..

-

మనిషిలో కూసంత కళాపోషణ ఉంటుంది.. ఏదొక టాలెంట్ ఉంటుంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులో కి వచ్చారు. తమలోని టాలెంట్ ను చూపించేందుకు ఇది మంచి వేదిక అనే చెప్పాలి.. ఇలా చాలా మంది ఫెమస్ అయ్యారు. కొంత మంది ఏకంగా సినిమాల్లో అవకాశాలను కూడా అందుకున్నారు.. ఇప్పుడు మంచి స్థానం ఉన్నారు..

సోషల్ మీడియా కొందరిని ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మార్చేసింది. ఈ నేపథ్యంలో మరో మట్టిలో మాణిక్యం వెలుగులోకి వచ్చింది. మహాబలేశ్వర్ వీధుల్లో లతా మంగేష్కర్ సూపర్ హిట్ సాంగ్ సునో సజ్నా పాపిహే నే పాట పాడుతున్న ఒక మహిళ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది..1966 లో విడుదల అయిన ఆయే దిన్ బహర్ కే మూవీ నుంచి లతాజీ పాడిన పాటను తనదైన శైలిలో ఆలపిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు.

ఆమె గొంతులో ఈ పాట మరింత ఆకట్టుకుంటుందని నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.. లతాజీని మరిపించింది.. ఆమె గొంతులో మ్యాజిక్ ఉంది.. పాడుతుంటే వినాలాని అనిపిస్తుంది అంటూ అభినందిస్తున్నారు.. ఆ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. మహాబలేశ్వర్లోని పంచ్గని సమీపంలోని పార్శీ పాయింట్ వద్ద ఆ మహిళ ఈ పాట పాడారు. ఈ వీడియోను లక్షల మందికి పైగా వీక్షించారు. మహిళ అద్భుతమైన గళాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.. మొత్తానికి ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీరు ఆ వీడియో ఇప్పుడు ఒకసారి చూడండి.. ఎంత అద్బుతంగా ఉందో కదూ.. వారిని ఎంకరేజ్ చెయ్యాలంటు కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

https://www.instagram.com/reel/Ck-VjP6JNi_/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news