అప్పు తిరిగి అడిగితే, 39 మంది రేప్ చేసారని కేసు పెట్టిన మహిళ…!

-

అప్పు తీసుకుంటారు గాని తిరిగి అడిగితే మాత్రం చాలా బాధగా ఉంటుంది కొంత మందికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారు కొందరు అయితే, ఉన్నప్పుడు ఇస్తామని చెప్పే వారు మరికొందరు. ఇక ఫోన్ లు ఎత్తకుండా సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే తిరిగే పెద్ద మనషులకు సమాజంలో కొదవ లేదు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మనకు ఆ బ్యాచ్ కనపడుతుంది. తాజాగా ఒక ఆశ్చర్యకర ఘటన బయటకు వచ్చింది.

తనను అప్పు అడిగారని 39 మంది అత్యాచారం చేశారంటూ 32 ఏళ్ల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాకు చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తనను గ్రామానికి చెందిన 39 మంది అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. దీనితో వెంటనే స్పందించిన ఎస్పీ కార్యాలయం, సదరు గ్రామం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీసులను పిలిపించడం

ఈ విషయం అలా అలా గ్రామస్తులకు కూడా తెలిసింది. వెంటనే వారంతా వచ్చి ఎస్పీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేసారు. ఆమె తప్పుడు ఫిర్యాదు ఇస్తోందని, ఆ మహిళ, ఆమె భర్త గ్రామానికి చెందిన కొందరి వద్ద రూ.2.50 లక్షలు అప్పులు తీసుకున్నారని వాటిని తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం వల్లే ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. వారంతా ఆ మహిళపై రివర్స్ కేసు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news