మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు !

-

BREAKING : జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.

పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయనకు నోటీసులు పంపింది. భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చని పవన్ అనడం బాధించిందని మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. అయితే.. ఈ నోటీసులపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news