Womens Day : రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. 40 మంది మ‌హిళ‌ల‌కు పుర‌స్కారాలు

-

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు రంగాల్లో సేవ‌లు చేసి గుర్తింపు పొందిన మ‌హిళ‌ల‌కు అవార్డులు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాగ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజు ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తుంది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ 2021-22 ఏడాదికి సంబంధించి.. మొత్తం 40 మ‌హిళ‌లకు అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.

telangana-logo

వారి జాబిత‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. కాగ వీరికి ఈ అవార్డు తో పాటు రూ. లక్ష బ‌హుమానంగా కూడా ఇవ్వ‌నున్నారు. కాగ ఈ జాబితాలో ప్రొఫెస‌ర్ లక్ష్మీ రెడ్డి, ఐపీఎస్ బ‌డుగుల సుమ‌తి తో పాటు ర‌మాదేవి లంకా, ఉషా ఆర్ రెడ్డి, ఏ జ్యోతి గౌడ్, సౌమ్య గుగులోతు తో పాటు గొట్టె క‌న‌క‌వ్వ తో స‌హా మొత్తం 40 మంది మ‌హిళ‌లకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ అవార్డును ప్ర‌కటించింది. త్వ‌ర‌లోనే వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ అవార్డును ప్రాధానం చేయ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news