Womens World cup 2023 : పాక్ తో మ్యాచ్…టీమిండియాకు బిగ్ షాక్

-

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ తో జరిగే తమ తొలిమ్యాచ్ లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందాన బరిలోకి దిగడం సందేహంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్మృతి చేతి వేలికి గాయమైంది.

 

ఈ గాయం నుంచి ఆమె కోలుకోకపోవడంతో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో స్మృతి ఆడలేదు. మరోవైపు భుజం నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా తొలి మ్యాచ్ లో ఆడేది లేనిది ఆదివారం తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news