ఏపీ మంత్రులు తోలుబొమ్మలు..పెత్తనమంతా సలహాదారులదే : యనమల

-

పప్పెట్ కేబినెట్ గా మారిన జగన్ మంత్రివర్గమని.. నామమాత్రపు అధికారాలతో మంత్రులు తోలుబొమ్మల్లా ఆడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల చురకలు అంటించారు. పేరుకే మంత్రులు… పెత్తనమంతా సలహాదారులదేనని.. ప్రతి శాఖలోనూ మంత్రులు ఉత్సవ విగ్రహాలే అని నిప్పులు చెరిగారు. రాష్ట్రం లోపల సజ్జల, వెలుపల విజయసాయిలదే పెత్తనమంతా అని.. తాడేపల్లి కిచెన్ నుంచే జగన్ పాలన నడుస్తోందని వెల్లడించారు.

yanamala ramakrishnudu

 

సజ్జల మాట్లాడుతుంటే వెనకాల బొత్స, బుగ్గన, పేర్ని నిలబడటం కన్నా ఘోరమేముంది? సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. ఉద్యోగుల న్యాయ బద్దమైన డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడంలేదు? అని ఫైర్ అయ్యారు. కొత్త పిఆర్సీ నివేదిక బైటపెట్టడానికి అభ్యంతరం ఏంటి? టిడిపి ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన మేళ్లను నిలిపేయడం,రివర్స్ చేయడం కన్నా దివాలాకోరుతనం ఏముంది? అని ప్రశ్నించారు. అభివృద్ధి సహా అన్నింటినీ రివర్స్ చేసిన సీఎం జగన్ను రివర్స్ చేయడమే ఇక మిగిలుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news